పూరీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టం విజయవంతమైంది. గతనెల 22న శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. అది ఈరోజు ఉదయం 9.30గంటలకు చంద్రుని క్షక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. మేక్ ఆర్ బ్రేక్గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఈ సందర్భంగా భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి ఇస్రోకు అభినందనలు తెలుపుతూ.. చంద్రయాన్-2 వ్యోమనౌక చందమామవైపుకు దూసుకెళ్తున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. దానిపై జయ హో ఇండియా అని తీర్చిదిద్దారు.
Mon Jan 19, 2015 06:51 pm