హైదరాబాద్: తండ్రిని హత్య చేసిన కొడుకు కిషన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16వ తేదీన మౌలాలి ఆర్టీసీ కాలనీలో తన తండ్రి మారుతి(80)ని కిషన్ హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్య సమయంలో నిందితుడి తల్లి, సోదరి పక్కనే ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. కిషన్తో పాటు అతడి తల్లి, సోదిరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తండ్రిని చంపిన కిషన్ అతడి శరీర భాగాలను బకెట్లలో కుక్కాడు.
Mon Jan 19, 2015 06:51 pm