శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత షీలా రషీద్.. దానికి సంబంధించిన సక్ష్యాధారలను చూపించడానికి సిద్ధపడి ఉన్నానని ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆమె పైవిధంగా చెప్పారు. ఆర్మీ ఇక్కడ నిష్పాక్షిత దర్యాప్తు చేస్తోంది. నేను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. దానికి సంబంధించిన అన్ని ఆధారాలను చూపిస్తాను అని షీలా రషీద్ చెప్పుకొచ్చారు. కాశ్మీర్లో యువకుల్ని అపహరిస్తున్నారని, అక్కడి ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని ఆదివారం షీలా రషీద్ ట్వీట్ చేశారు. అనంతరం సోమవారం సుప్రీం కోర్టు లాయర్ ఒకరు ఆమె వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలపై ఆర్మీ చర్యలు తీసుకుంటే? అని షీలాను ప్రశ్నించగా ఆధారాలతో బయటికి వస్తే ఏం జరుగుతుంది? సమస్య దీని గురించి కాదు. కాశ్మీర్ పై చెప్పే ఏ విషయమైనా అబద్దమనే వాతావరణం ఉంది. అయితే నా వ్యాఖ్యలు తప్పు అని చెప్పడానికి ఆర్మీ దగ్గర ఆధారాలున్నాయా? అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm