రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం దన్నారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో మహేశ్వరంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న బాలికతో లిఫ్ట్ ఇస్తామని బైక్పై తీసుకెళ్లిన ఇద్దరి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయం బాధితురాలు తన తల్లిదండ్రులతో చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm