ఒడిశా: భువనేశ్వర్ లో ఎగిరేపాము (ఫ్లైయింగ్ స్కేక్) ను అధికారులు సీజ్ చేశారు. ఓ వ్యక్తి ఎగిరే పామును జనాల మధ్య ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న జంతుసంరక్షణ విభాగం అధికారులు పామును పెంచుకుంటున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మూగజీవాలను హింసించడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం విల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నేరంగా పరిగణించబడుతుంది. పామును అటవీ ప్రాంతంలో వదిలిపెడతాం. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తామని భువనేశ్వర్ ఫారెస్ట్ ఇన్ ఛార్జి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm