న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కలవరపరచే ధోరణులపై మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 75వ జయంత్యుత్సవాల సందర్భంగా రాజీవ్ యూత్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం డాక్టర్ సింగ్ మాట్లాడారు. దేశంలో అసహనం, మతపరమైన కేంద్రీకరణ, మూక హింస అలజడి రేపుతున్నాయన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యం వంటివాటిని దెబ్బతీసేవిధంగా, ప్రస్తుతం అసహనం, మతపరమైన కేంద్రీకరణ, మూక హింస పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగంలో చెప్పినదానికి విరుద్ధంగా ప్రస్తుత పోకడ ఉందన్నారు. కొన్ని వర్గాల విద్వేషం ద్వారా జరిగే హింసాత్మక నేరాలు మన రాజ్యపాలన విధానాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ అవాంఛనీయ ధోరణులపై బాగా ఆలోచించవలసిన సమయం ఇదేనని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm