బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిన అనంతరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా మంత్రి వర్గ విస్తరణ చేయలేదు. భారీ వర్షాలతో, వరదల కారణంగా ఆలస్యమైన ఈ కార్యక్రమం స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్. నగేష్ సహా పదహారు మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ వాజూబాయి వాలా వారితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.
Mon Jan 19, 2015 06:51 pm