అమరావతి: గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ సంక్షేమశాఖ కార్పొరేషన్ల ద్వారా రాజకీయలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరుపుతామన్నారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆదరణ పథకంతో పాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని
Mon Jan 19, 2015 06:51 pm