కడప: జిల్లాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కొల్లం గంగారెడ్డికి బెయిల్ మంజూరైంది. 27 ఎర్ర చందనం కేసుల్లో గంగారెడ్డి నిందితుడిగా ఉన్నాడు. గాజులమండ్యం కేసులో తిరుపతి కోర్టు గంగారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. 2015 నుంచి కడప జిల్లా కేంద్ర కారాగారంలో గంగారెడ్డి ఉంటున్నాడు. కాసేపట్లో గంగారెడ్డి బెయిల్పై విడుదల కానున్నాడు. గంగారెడ్డిని శ్రీలంకలో అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. 2015 నుంచి 2017 వరకు గంగారెడ్డి జైలులో ఉన్నాడు. 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు పీడీ యాక్ట్ కింద గంగారెడ్డిని జైలులో ఉంచారు. 2018 నుంచి ఈ రోజు వరకు గంగారెడ్డిని రిమాండ్ ఖైదీగా ఉంచారు.
Mon Jan 19, 2015 06:51 pm