ముంబయి: యస్బ్యాంక్ షేర్లు వరుసగా రెండో రోజు కూడా పతనం అయ్యాయి. నేడు ఇంట్రాడేలో ఒక దశలో 7శాతం వరకు విలువ కోల్పోయాయి. రెండ్రోజుల్లో కలిపి 10శాతానికి పైగా విలువ కోల్పోయింది. మరోపక్క కంపెనీ విజయవంతంగా క్యూఐపీ ద్వారా రూ.1,930 కోట్లను సమకూర్చుకొంది. ప్రస్తుతం యస్బ్యాంక్ షేరు క్యూఐపీ ధర కంటే 15శాతం తక్కువ ధరలో ఇప్పుడు ట్రేడవుతోంది. మరో 1శాతం విలువ కోల్పోతే 52వారాల అత్యల్పానికి చేరుకొంటుంది. మరోపక్క సీజీ పవర్లో అవకతవకలు చోటు చేసుకోవడం కూడా షేరు ధరపై ప్రభావం చూపింది. ఈ కంపెనీలో యస్బ్యాంక్కు 12.79శాతం వాటాలు ఉన్నాయి. ఆగస్టు 16న బ్యాంక్ 231 మిలియన్ల ఈక్విటీ షేర్లను క్యూఐపీ ద్వారా విక్రయించింది. ఈ సందర్భంగా షేరుకు రూ.83.55 ధరను వసూలు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm