న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ టెస్ట్ కెప్టెన్సీ రికార్డుకు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరువలో ఉన్నాడు. టెస్టు కెప్టెన్గా ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రికార్డులకెక్కాడు. ఇప్పుడా రికార్డును సమం చేసేందుకు కోహ్లీ రెడీ అయ్యాడు. కోహ్లీ ఇప్పటి వరకు 46 మ్యాచుల్లో 26 సార్లు భారత్కు విజయాన్ని అందించిపెట్టాడు. ధోనీ రికార్డును సమం చేసేందుకు కోహ్లీకి కావాల్సింది మరొక్క విజయమే. ఈ నెల 22 నుంచి అంటిగ్వాలో విండీస్తో జరగనున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధిస్తే ధోనీ రికార్డు సమం అవుతుంది. రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్గా కోహ్లీ పేరు రికార్డులకెక్కుతుంది. అంతేకాదు.. అతి తక్కువ టెస్టుల్లో ఆ ఘనత సాధించిన కెప్టెన్గానూ కోహ్లీ రికార్డులకెక్కుతాడు. టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 49 మ్యాచుల్లో 21 విజయాలు సాధించింది. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో 14 టెస్టు విజయాలు సాధించింది. ఇక, ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 109 మ్యాచుల్లో 53 విజయాలు సాధించాడు. 48 టెస్టు విజయాలతో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm