హైదరాబాద్ : మోడీ-అమిత్షా ద్వయం తెలంగాణలో పనిచేయదని, వారి పప్పులు ఇక్కడ ఉడకవని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణు గోపాలాచారి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో మోడీ-అమిత్షా నేతృత్వంలో చాలా రాష్ర్టాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి రెండోసారి అధికార పగ్గాలను ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు పథకాలను అమలు చేస్తోందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm