హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm