హైదరాబాద్ : ఓ బాలుడికి, వివాహితకు చెప్పుల దండేసి ఊరేగించారు. ఈ అమానవీయ సంఘటన హర్యానాలోని దనియాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ మహిళ కర్నాల్లో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్త ట్రాన్స్జెండర్. ఈ క్రమంలో 12వ తరగతితో చదువుతున్న ఓ యువకుడితో సదరు మహిళకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని మహిళ కమ్యూనిటీకి చెందిన బంజారా కులస్తులు పంచాయతీ పెట్టారు. కాగా, సర్పంచ్ నిర్ణయం మేరకు వారిద్దరినీ ఊరి నుంచి పంపించాలని నిర్ణయించారు. పంచాయతీ అయిపోయిన తర్వాత కొంతమంది బంజారాలు కలిసి బాలుడికి, వివాహితకు చెప్పలు దండేసి గ్రామంలో ఊరేగించారు. బాలుడిని తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ అమానవీయ ఘటనపై పోలీసులు స్పందించారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm