శ్రీకాకుళం : ఇచ్ఛాపురం హైవే పై గురువారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక లారీలను సీజ్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక లారీలను పోలీస్ లు సీజ్ చేశారు. బెళ్ళుపడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. పట్టణ పోలీసులకి 7 లారీలు, కొజ్జిరియ జంక్షన్ వద్ద 9 లారీలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా ఒడిశా నుంచి ఆంధ్ర ప్రాంతం లోకి వివిధ చోట్లకు ఇసుకను రవాణా చేస్తున్న లారీలను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ చిన్నమనాయుడు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm