బీజింగ్: చైనాను వరదలు పోటెత్తాయి. కొద్ది రోజులుగా దేశంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలో వరదలో కూరుకుపోయాయి. జూన్ నుంచి పొటెత్తిన వరదల కారణంగా ఇప్పటి వరకు చైనాలో 627 మంది ప్రజలు గల్లంతయ్యారని, 7.18 కోట్ల మంది ప్రజలు నిరాశ్రాయులయ్యారని ఆ దేశ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, గల్లంతైన వారిలో చాలా మంది మరణించి ఉంటారని, అయితే ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.జూన్ నుంచి చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. దీని వల్ల ప్రాణనష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఇప్పటి అంచనాల ప్రకారం 30.5 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చైనా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm