చెన్నై: తూత్తుకుడి కోర్టు ప్రాంగణంలో బుధవారం ఉదయం ఓ న్యాయవాది తమ్ముడు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. తూత్తుకుడి కోరం పల్లంకు చెందిన పచ్చైకన్ కుమారుడు శివకుమార్ (32) సోదరులు రామ్కుమార్, ముత్తుకుమార్ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. ఓ కేసు వ్యవహారమై బుధవారం ఉదయం 10 గంటలకు శివకుమార్ తన కారులో కోర్టుకు బయల్దేరాడు. తూత్తుకుడి కోర్టు, తెన్బాక్కం పోలీస్స్టేషన్ మధ్యలో కోర్టు వెనుకవైపు నుంచి శివకుమార్ కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అతని కారును బైక్లో వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు శివకుమార్ కారు దిగిన వెంటనే కత్తులతో అతనిపై దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న తూత్తుకుడి టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిన శివకుమార్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm