హైదరాబాద్: టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ల్లో వైట్వాష్ అయిన వెస్టిండీస్కు టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ ఆల్ రౌండర్ కీమో పాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ చీలమండ గాయంతో పాల్ తొలి టెస్టు నుంచి వైదొలిగినట్లు విండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కీమో పాల్ను జట్టుతో పాటే కొనసాగిస్తున్న విండీస్.. రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది. కాగా, తొలి టెస్టులో పాల్ స్థానంలో మరొక ఫాస్ట్ బౌలర్ మిగుల్ కమిన్స్కు చోటు కల్పించింది. ఈ విషయాన్ని విండీస్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm