న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో ఇటీవల ఫ్రొఫెసర్ల బ్లాక్ అగ్నికి ఆహుతైంది. దీంతో వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో కూర్చొనేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో ప్రొఫెసర్లు ఇంట్లోనే కూర్చుని వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా రోగులను చూసి, జూనియర్ డాక్టర్లకు చికిత్స సంబంధిత సలహాలను అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగి ఐదురోజులు దాటినా, ప్రొఫెసర్లకు తగిన ఛాంబర్ ఇంకా కేటాయించలేదు. ఎయిమ్స్కు చెందిన ఒక విభాగాధిపతి మాట్లాడుతూ తాను ఎయిమ్స్లో కూర్చునేందుకు తగిన జాగా లేదని వాపోయారు. ఇందుకు మరో మార్గం కూడా లేకపోవడంతో వీడియో కాల్స్ ద్వారా రోగుల పరిస్థితులు గ్రహించి, జూనియర్ డాక్టర్లకు సహాయం అందిస్తున్నానన్నారు. వారంలో ఒకటి లేదా రెండు ఓపీడీలతో పాటు సర్జరీలను చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. తగిన ఛాంబర్ లేకుండా పనులను చేయడం కష్టంగా మారింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా విభాగంలోని అన్ని ఫైళ్లు, కంప్యూటర్లు కాలిపోయాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm