ముంబయి: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. గురువారం వేకువజామున బళ్లార్పూర్లోని జనావాసాల్లో ఎలుగు సంచరించడంతో పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని బంధించారు. ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న ఎలుగుబంటిని అడవిలో విచిడిపెడతామని అటవీ సిబ్బంది తెలిపారు. నిత్యం వన్యమృగాల దాడులతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని చంద్రపూర్ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm