పశ్చిమగోదావరి : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన గన్నమని శ్రీనివాసరావు (48) తనకున్న ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ.. అదనంగా మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు సాగు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో వ్యవసాయం లాభసాటిగా లేక అప్పుల భారం పెరిగిపోవడంతో బుధవారం (నిన్న) సాయంత్రం తనకు చెందిన పశువుల పాక వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై రాత్రి పొద్దుపోయాక చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతదేహాన్ని నిడదవోలు మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జయ విష్ణువర్ధన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm