హైదరాబాద్: పిపీఏల రద్దుపై జగన్ సర్కార్ వెనక్కు తగ్గింది. విదేశీ బ్యాంకుల వ్యతిరేకత సెగ తగలడంతో సర్కార్ ఒక అడుగు వెనక్కు వేసినట్టుగా కనిపిస్తున్నది. కేవలం అవకతవకలు జరిగినట్లుగా ధృవీకరించిన ఒప్పందాలనే పునస్సమీక్షిస్తామని జగన్ సర్కార్ కేంద్రానికి తెలిపింది. ఏపీ సర్కార్ తీసుకున్న ఏ నిర్ణయమైనా కేంద్రంతో, ప్రధానంగా మోడీ, అమిత్ షాలతో చర్చించిన తరువాతనే తీసుకున్నామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే పీపీఏలపై జగన్ సర్కార్ ఒక అడుగు వెనక్కు వేయడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm