అమరావతి: జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈరోజిక్కడ మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరంకు నష్టమన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదన్నారు. టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నోసార్లు వద్దని చెప్పారన్నారు. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm