హైదరాబాద్ : జీబ్రానిక్స్ కంపెనీ.. మాస్టర్పీస్ పేరిట ఓ నూతన వైర్లెస్ స్పీకర్ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆఫ్లైన్ స్టోర్స్తోపాటు పలు ఆన్లైన్ స్టోర్స్లోనూ ఈ స్పీకర్ను రూ.2699కు విక్రయిస్తున్నారు. ఇందులో 57ఎంఎం 8వాట్ల ఆడియో డ్రైవర్స్ను ఏర్పాటు చేసినందున సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ స్పీకర్ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 12 గంటల వరకు నాన్స్టాప్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ స్పీకర్ను ఇతర డివైస్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm