హైదరాబాద్ : ఏపీ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. రాజధానిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. వరదలు వచ్చాయని ఏకంగా రాజధానినే మార్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ, మద్రాసులకు ఎన్నో సార్లు వరదలు వచ్చాయని... వాళ్లు రాజధానిని ఎందుకు మార్చలేదని అన్నారు. మీకు అమరావతి మొదటి నుంచి ఇష్టం లేదనే విషయం ప్రజలందరికీ తెలుసని ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm