హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముందు సీబీఐ 20 ప్రశ్నలు ఉంచింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఆయన్ను నిన్న రాత్రి 12గంటల సమయంలో ఆయనను విచారించడం ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాత్రంతా ఆయన నిద్ర లేకుండా గడిపినట్లు వెల్లడించాయి. గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాల్సిందిగా సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు. అందుకు ఆయన తిరస్కరించారు. తర్వాత విచారణ ప్రారంభించారు. సుమారు 20 కీలక ప్రశ్నలను ఆయన ముందు ఉంచారు. ఇంద్రాణీ ముఖర్జియాతో సమావేశం, ఇతర అంశాలపై ఆయనను ప్రశ్నించారు. రెండో దఫా విచారణ ఉదయాన్నే 8గంటల సమయంలో మొదలైంది. దాదాపు ప్రశ్నలన్నింటికీ చిదంబరం 'చెప్పలేను', 'స్పష్టంగా తెలీదు' అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm