విజయవాడ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. ఇరిగేషన్పై, రాష్ట్ర ప్రయోజనాలపై కనీస అవగాహన లేకుండా...జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm