నెల్లూరు : మెమో ట్రైన్ నుండి దిగుతూ ప్రమాదవశాత్తూ హెల్త్ సూపర్వైజర్ కు తీవ్ర గాయాలైన ఘటన గురువారం నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరు ఎస్వివి కార్యక్రమంలో పాల్గొనేందుకు మెమో ట్రైన్లో గూడూరు నుంచి నెల్లూరుకు వస్తున్న హెల్త్ సూపర్వైజర్ తిరుపాలు రైలు నుండి దిగుతుండగా, ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని ఏసిఎస్ ఆర్జిజిహెచ్ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలను తిరుపాల్ అయ్యకు అందిస్తున్నారు. ఆర్థో విభాగం వైద్య నిపుణులు మస్తాన్ భాష పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగుతున్నాయి.తిరుపాలు కు చేయి కట్ అయ్యిందని, కాలు తొడ భాగం వరకు నుజ్జు నుజ్జయిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి రైలు ప్రమాదంలో గాయాలపాలైన విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజ్యలక్ష్మి హుటాహుటిన చేరుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm