హైదరాబాద్: ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అన్నారు. ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న ఆయన విమానాశ్రయంలోనే విలేకరులతో మాట్లాడారు. మోడీ సర్కార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే, ఎండగడుతున్నందునే చిదంబరంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కార్తి చిదంబరం అన్నారు. తన జీవితంలో ఇంతవరకు పీటర్, ఇంద్రాణీ ముఖర్జీని కలవనే లేదని స్ఫష్టం చేశారు. సీబీఐ విచారణ సమయంలోనే వారిని తొలిసారి కలిశానని, ఎఫ్ఐపీబీలో తనకు ఎవరూ తెలీదని, ఆ పద్ధతి కూడా తనకు తెలియదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm