హైదరాబాద్ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కస్టడీ విధించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. చిదంబరానికి నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చిదంబరం ఈ నెల 26 వరకూ కస్టడీలో ఉండనున్నారు. చిదంబరం కుటుంబసభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు రోజూ చిద్దూను కలవవచ్చని కోర్టు పేర్కొంది. కాగా, చిదంబరంను ఐదు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకోవాలని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm