న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్పై స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ 'ఫ్లాగ్షిప్' 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ ప్రొడక్ట్ చీఫ్ ఆఫీసర్ జుహో సర్వికాశ్ వెల్లడించారు. 5జీ స్మార్ట్ఫోన్లు ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియాతోపాటు యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నోకియా కూడా ప్రవేశించబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలతో పోలిస్తే సగం ధరకే 5జీ ఫోన్ను తీసుకురావాలని నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. నోకియా 5జీ ఫోన్ ధర రూ.35,600-రూ.42,700 మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm