ఆంటిగ్వా: రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కీమర్ రోచ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి మయాంక్ అగర్వాల్(5) కీపర్ హోప్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి పుజారా(2) కూడా కీపర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 25 పరుగుల వద్ద కోహ్లీ (9) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజ్లో రాహుల్(11), రహనే (0) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm