మహబూబాబాద్: బైక్ ను డీసీఎం వెనుక నుండి ఢీకొట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగింది. ఈ ఘటనలో దక్కన తండాకి చెందిన జాటోత్ కిషన్(35) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm