కైకలూరు: కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఐవా రుద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను బలరామకృష్ణ, సుబ్బలక్ష్మి, గంగాధరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm