హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రెండోసారి మంత్రి పదవి చేపట్టాక కేటీఆర్ తొలిసారి తెలంగాణ భవన్కు విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నమస్కరించారు. పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జీలు, సెక్రటరీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సమీక్ష చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm