ఏలూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఈనెల 25వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చింతమనేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. అట్రాసిటీ కేసులో చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేనిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm