తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో బోటు ముంపు ప్రమాద ఘటనలో తాజాగా రెస్క్యూ టీం మరో 4 మృతదేహాలను వెలికితీసింది. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కచ్చులూరు సమీపంలో 4 మృతదేహాలను గుర్తించి..బయటకు తీశాయి. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 12 కి చేరింది.
ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది నిన్న 27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. అదృశ్యమైన మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, 08 ఐఆర్ బోట్లు, 12 అస్కా లైట్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఏపీ మంత్రులు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 16,2019 09:59AM