న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం లైంగిక దాడి, పోస్కో కేసుల విచారణ నిమిత్తం దేశ వ్యాప్తంగా 1023 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నది. సుమారు 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై త్వరితగతిన విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నది. ఈ కోర్టులు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని జస్టిస్ డిపార్ట్మెంట్ తన ప్రతిపాదనలో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm