తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో బోటు ముంపు ఘటనలో గాయపడిన వారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తెలంగాణ వాసులను మంత్రి పువ్వాడ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి పువ్వాడ నిర్దేశించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ బోటు ముంపు ఘటనాస్థలంలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm