హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా పద్మావతి పేరును టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్ఠానానికి సమాచారం లేకుండా ఉత్తమ్ ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను ప్రశ్నించారు. గోల్కొండ హోటల్లో బుధవారం కుంతియాతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉత్తమ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని రేవంత్ రెడ్డితో కుంతియా చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm