చెన్నై: హిందీ భాషను మేము ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు 'ఒకేదేశం ఒకే భాష'.. అనడంతో తమిళనాడులోని ప్రతి పార్టీ, నాయకులు, ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. హిందీని ఎప్పటికీ తమిళనాడులో చొప్పించలేరని అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో.. హోం మంత్రి అమిత్షా తన వ్యాఖ్యల పట్ల స్పష్టతనిచ్చారు. హిందీని మొదటి భాషగా కాకుండా రెండో భాషగా స్వీకరించొచ్చు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రతిస్పందిస్తూ.. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన ర్యాలీని విరమించుకున్నప్పటికీ హిందీని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామనీ, తమిళులు సైతం హిందీ భాష పట్ల సుముఖత చూపించరని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm