హైదరాబాద్ : రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్... పండుగ సీజన్ ను ద్రుష్టి లో పెట్టుకొని వినియోగదారులకోసం గ్రేట్ ఇండియన్ సేల్ ను తీసుకొచ్చింది. ఈనెల 29న అర్ధరాత్రి 12గంటలకు ఈ సేల్ ప్రారంభం అయ్యి అక్టోబర్ 4 అర్ధరాత్రి 12గంటలకు ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12గంటల నుండే ఈ సేల్ ను యాక్సెస్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది. కాగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ సేల్ ద్వారా భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. అందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ టీవీలు , స్మార్స్మార్ట్ ఫోన్లు , గృహోపకరణాలు , ఫ్యాషన్ తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm