న్యూఢిల్లీ : దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని అయోధ్య కేసు విచారణను వచ్చేనెల18 నాటికి పూర్తి చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ తేదీకి వాదనలు ముగుస్తాయని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు పార్టీలు కోరుకుంటే అలాగే చేయవచ్చునని తెలిపింది. అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయోధ్య కేసుపై వరసనే 26వ రోజైన బుధవారం కూడా సుప్రీం కోర్టు విచారణ జరపింది. ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న క్రమంలో ఆలోగానే కేసు విచారణను పూర్తి చేసి తీర్పు వెలువరించే అవకాశం వుంది. లేకుంటే మొత్తం ప్రక్రియను పునఃప్రారంభించాల్సి వుంటుంది. అక్టోబరు 18 నాటికి విచారణ ముగిసేలా అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి ప్రయత్నం చేయాల్సి ఉందని గొగొయ్ అన్నారు. అవసరమైతే ఈ కేసుపై ప్రతి రోజూ ఒక గంట అదనంగా విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. శనివారం కూడా విచారణ విచారణ జరుపుతామన్నారు. మధ్యవర్తిత్వం విషయంలో కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను సమర్పిస్తే దానిని కూడా పరిశీలిస్తామని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm