ఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి మరో 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మొదట్లో దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుదిరిన ఒక ఒప్పందం కింద 36 యుద్ధవిమానాలను భారత్ అందుకోనుంది. ఇందులో మొదటి లోహవిహంగాన్ని వచ్చే నెల 8న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా అందుకోనున్నారు. కొత్తగా మరో 36 యుద్ధవిమానాలను సమకూర్చుకోవడం వల్ల భారత వైమానిక దళ బలం మరింత ఇనుమడిస్తుంది. ఆధునిక జెట్ల కొరతను కొంత మేర అధిగమించడానికి వీలవుతుంది. మరోవైపు అమెరికా తన ఎఫ్-16 లేదా ఎఫ్-21 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భారత్పై ఒత్తిడి తెస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm