హైదరాబాద్: ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 35 ఈ-సిగరెట్లు, 68 వివిధ ఫ్లేవర్ల బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. షాలిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ నూర్ ఆరిఫ్(45) మొజంజాహి మార్కెట్లో గుల్నార్ పెర్ఫ్యూమ్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా నిషేధించిన ఈ-సిగరెట్లు, ఫ్లేవర్లు అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది షాపుపై దాడి చేసి సిగరెట్లు, ఫ్లేవర్ల బాటిళ్లు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm