విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని.. చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమలో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm