హైదరాబాద్: హైదరాబాద్లోనూ ఇంధన ధరలు పరుగులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్ రేటు ఆదివారం 29 పైసలు పెరిగి రూ.78.26కు చేరింది. డీజిల్ ధర 23 పైసలు ఎగిసి రూ.72.75గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు.. దేశీయ చమురు మార్కెట్లో ధరలను పరుగులు పెట్టిస్తున్నాయని చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ఎల్పీజీ (వంటగ్యాస్) సరఫరాల్లో కొంత వాయిదాలను సౌదీ కోరినా.. ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెబుతున్నదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. సౌదీ అరేబియా నుంచి ప్రతి నెలా దాదాపు 2 లక్షల టన్నుల ఎల్పీజీని భారత్ కొనుగోలు చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm