నిజామాబాద్: గోదావరి ప్రాజెక్టులకు వరద భారీగానే వస్తున్నది. ఎగువప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రధాయినీ నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 74,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఆదివారం సాయంత్రానికి ఐదు టీఎంసీల మేర వరద వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1079.80 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1090 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 51.86 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 90.31 టీఎంసీలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 1,700 క్యూసెక్కులపైగా వరద వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకున్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తు తున్నది. కిన్నెరసాని రిజర్వాయర్కు వరదనీరు వచ్చి చేరుతున్నది.
Mon Jan 19, 2015 06:51 pm