అమరావతి: ఉండవల్లి కరకట్టపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. చంద్రబాబు ఇంటితో పాటు మరో రెండు ఇళ్లను కూడా అధికారులు నేడు కూల్చివేయనున్నారు. వారం రోజుల్లోగా కట్టడాలను ఖాళీ చేసి కూల్చి వేయాలని, లేకుంటే తామే ఆ పని చేస్తామని సీఆర్డీయే నుంచి గత వారం పలువురికి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. దీనిపై లింగమనేని రమేశ్ ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడం, మిగతా వారిలో కొందరు వచ్చి తమతమ వాదనలు వినిపించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 31 కట్టడాలకు నోటీసులు జారీ కాగా, 20 మంది వాదనలు విన్న అధికారులు, 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంతో పాటు శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 బిల్డింగ్ లు, అక్వా డెవిల్స్ పేరిట ఉన్న ఓ కట్టడంతో పాటు, మరో మూడు అంతస్తుల భవనం కూడా ఉన్నాయని సీఆర్డీయే అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm