శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఒడిశాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో టెక్కలి మండలం అక్కవరం జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. గుండెపోటుతో బస్సు డ్రైవర్ జోగేందర్ శెట్టి మృతి చెందగా, బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సు దమంజోడ నుంచి భూవనేశ్వర్ వెళ్తుందగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm